ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారికి అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 24, 2021, 11:54 AM

ఏపీలోని సచివాలయ తొలి బ్యాచ్ ఉద్యోగులకు అక్టోబర్ 2వ తేదీకి రెండేళ్ల సర్వీసు పూర్తవుతుంది. దీంతో వారందరికీ నిబంధనల ప్రకారం పే స్కేలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులకు క్రెడిట్ బేస్ అసెస్‌మెంట్ పరీక్షను సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ మధ్య ఒక రోజున నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ నిర్ణయించింది. ఈ పరీక్షకు ప్రశ్నాపత్రం తయారీ, ఫలితాల వెల్లడి, ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించినట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ వెల్లడించారు.


గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నిర్వచించే ఈ రాత పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అయితే వారిని సర్వీసుల నుంచి తొలగించరని ఏపీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయాన్ని సచివాలయశాఖ ప్రధాన కార్యదర్శి చెప్పారని ఆయన అన్నారు. ఉద్యోగుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com