వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమానికి శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రికేశ్ బి. లాటకర్, ఎమ్మెల్యలు గొర్లె కిరణ్కుమార్, కంబాల జోగులు బీసీ కార్పొరేషన్ చైర్మెన్లు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, దుక్క లోకేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీరాముల నాయుడు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తదితరులు హాజరయ్యారు.