తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. 'నమ్మిన సిద్ధాంతాలపట్ల మన నిబద్ధతను రుజువు చేయడానికి ఒక్కోసారి భగవంతుడు కూడా పరీక్షపెడతాడు. స్వార్థాన్ని త్యజిస్తే ఆ భగవంతుని మనసును కూడా గెలుచుకోగలమని ఇబ్రహీం ప్రపంచానికి తెలియజెప్పాడని' చంద్రబాబు వ్యాఖ్యానించారు.