అమరాతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవించైనా అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఇప్పటికే దాదాపు రు.10 వేల కోట్లు వెచ్చించి రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలని హితవుపలికారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ అన్నారు.