ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయ ఉద్యోగులకు త్వరలో పరీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 20, 2021, 04:53 PM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ అనంతరం వారిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల్లో వీరాంత రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో రెండు దశలలో పరీక్షలను నిర్వహించి ప్రొబేషన్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాయకత్వ లక్షణాలు, సాబర్డినేట్ సర్వీస్ నిబంధనలు, డిజిటల్ సేవలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పై మొదటి దశలో 35 మార్కులతో పరీక్ష, ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు, శాఖ పరమైన అంశాలతో 65 మార్కులకు మరో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఫెయిల్ అయిన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలను ఆన్ లైన్ ద్వారా ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం 1.34 లక్షల మంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com