అనంతపురం జిల్లా: ఉరవకొండ మండలం, బూదగవి గ్రామం దగ్గర మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు ఉరవకొండకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.