పంటల విషయంలో సస్యరక్షణ చర్యలు ముఖ్యం. వరి సాగులో రైతులకు ప్రయోజనం కలగాలంటే కాలిబాట ప్రధానమైనదంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పంటకు గాలి, వెలుతురు సక్రమంగా అందించడంలో కాలిబాటలు ఉపయోగపడతాయని.. దీనివల్ల వరి మొనలు దుబ్బు చేయడంతోపాటు చీడపీడల నుంచి ఎంతో రక్షణ కలుగుతుందంటున్నారు. వరిలో కాలిబాటలు ఏర్పాటు చేయడం వల్ల అన్నివైపులా ఎరువులు సమానంగా వేయడంతోపాటు సులభంగా పురుగు మందులు పిచికారి చేసుకునే అవకాశం లభిస్తుంది. పంట కోత దశలో అపరాలు జల్లుకోవడంలో కాలిబాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా చేయడం వల్ల కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మొక్కలో పత్ర హరితం అధికంగా ఉత్పత్తి అవుతుంది.