విజయవాడ: బిషప్ హాజరయ్య హై స్కూల్ లో తట్టు-రూబెల్లా కార్యక్రమాన్ని మంత్రి ఉమా మంగళవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ, 9 నెలల నుండి 15 సంవత్స్వరాల మధ్య పిల్లలకు తప్పని సరిగా ఈ టీకా వేయించాలన్నారు. ఆగస్ట్ 1 నుండి సెప్టెంబర్ 8 వ తేదీ వరకు టీకా కార్యక్రమం జరుగుతుందన్నారు. 2020 లోపు రుబెల్లా వ్యాధి లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు రుబెల్లా టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రుబెల్లా టీకా ను ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.