30 ఏళ్లు వచ్చినా పెళ్లికి అంగీకరించడం లేదని కన్న కూతుర్ని కాల్చి చంపాడో తండ్రి. మధ్యప్రదేశ్లోని ఝారై అనే గ్రామానికి చెదిన ఆశోక్ వైశ్ (69) కూతురు అంకు వైశ్ (30) భోపాల్లోని ఓ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోంది. పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరిగిన అంకు వైశ్ మాత్రం అంగీకరించడం లేదు. ఇదే విషయంలో ఇంట్లో తరచూ వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఈ వాగ్వాదం తారస్థాయికి చేరింది. తన మాటకు కూతురు ఎదురు చెప్పడాన్ని సహించలేకపోయిన అశోక్ వైశ్.. బెడ్ రూమ్ లో ఉన్న పిస్టల్ తీసుకొచ్చి కూతుర్ని కాల్చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.