విద్యుత్ వినియోగదారుల కష్టాలు తగ్గించే వార్తను చెప్పింది ఏపీ ఈపిడిసిఎల్. సహజవనరులతో తయారయ్యే విద్యుత్ ను వాడుకొనేలా ప్రాజెక్టులు తీసుకురావాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఐదు జిల్లాలో సోలార్ విద్యుత్ కోసం గృహ వినియోగదారులు అప్లై చేసుకోవచ్చని విద్యుత్ అధికారులు ప్రకటించారు. కేంద్ర సంప్రదాయ ఇంధన వనరుల పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ఆర్టిఎస్-II ప్రోగ్రాం కింద గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్టాప్ కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించినట్లు ఏపీఈపిడిసిఎల్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ వి.విజయ లలిత వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల గృహ విద్యుత్ వినియోగదారులకు ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ జిల్లాలోని వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు 3 ఏజెన్సీలను ఎంపానెల్ చేశామన్నారు. పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్ https://www.apeasternpower.com/solarDetials ద్వారా తెలుసుకోవచ్చన్నారు.