కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేసిన అప్పులు, కలిసిరాని కాలం వ్యక్తి మరణానికి కారణమయ్యాయి. వివరాలలోకి వెళితే.. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు శివారు తోడేళ్లదెబ్బ లంక గ్రామానికి చెందిన యువ రైతు గంగిశెట్టి శ్రీనివాసరావు (22) కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గతనెల 28న కలుపుమందు సేవించడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం శ్రీనివాసరావు మతి చెందినట్లు తండ్రి నాగ పోతురాజు తెలిపారు. నాలుగెకరాలు కౌలుకు తీసుకుని అరటి, పసుపు, కంద పంటలు సాగు చేస్తున్నామని, గత రెండేళ్లుగా కష్ణా నదికి వచ్చిన వరదల వల్ల పంటలు దెబ్బతిని రూ.5 లక్షల వరకూ అప్పుల పాలయ్యాయని, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తన కుమారుడు కలుపు మందు తాగాడని పోతురాజు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.