జాతీయ రహదారిపై ఒంగోలు-చిలకలూరిపేట మార్గంలో చిలకలూరిపేట మండల పరిధిలోని ఏఆర్ ఎంటర్ప్రైజెస్ ఎదురుగా శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. చిలకలూరిపేట ఎస్ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వాహనం సదరు వ్యక్తిని ఢీకొనడంతో అతను జాతీయ రహదారిపై పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడన్నారు. మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని, మృతుని ఆచూకీ తెలిసినవారు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. మురికిపూడి విఆర్వో షేక్ మస్తాన్వలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.