ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ పర్యాటక, ప్రయాణాల అవార్డుల సదస్సు వేదికగా రాష్ట్ర పర్యాటక శాఖకు బెస్ట్ అవార్డ్ ఫర్ మేనేజ్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమములో ఐటిసిటిఎ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ గుప్తా చేతుల మీదుగా ఏపీ పర్యాటక శాఖ ఉప సంచాలకులు కంచర్ల జయరావు ఈ అవార్డును అందుకున్నారు. ఏపీ టూరిజం నిర్వహిస్తోన్న కార్యక్రమాలు దేశ, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించటంతో పాటు ఇక్కడకు వచ్చిన వారికి విశేష అనుభూతుల్ని మిగిల్చేలా ఉన్నాయని వారు తెలిపారు. అందుకే ఈ అవార్డు అందజేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.