ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క చేపతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన మత్స్యకారుడు.. దాని ధర తెలిస్తే షాక్ ఇకా

national |  Suryaa Desk  | Published : Tue, Jun 01, 2021, 03:40 PM

ఒకే ఒక చేప. అతని పంట పండించింది. దాని బరువెంతో తెలుసా! ఒకటి, రెండు.. కాదు. ఏకంగా 48 కిలోలు. అంటే అర క్వింటాల్ అన్న మాట. వేలంలో దానికి పలికిన ధర ఎంతో తెలిస్తే.. మనమంతా షాక్‌కు గురవ్వాల్సిందే. 8 లక్షల 64 వేలు. ఇది ఒక చేప ధర. పాకిస్తాన్‌లో దొరికింది ఆ చేప. మత్స్యకారుల వలకు అప్పుడప్పుడు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. వాటికున్న విశిష్టతల వల్ల ధర లక్షల్లో పలుకుతుంది. పాకిస్థాన్ గ్వాదర్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు కూడా ఇలాంటి చేపతో రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు. జివానీలో నివసించే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్తే.. అతడి వలలో అరుదైన క్రోకర్ ఫిష్ పడింది. ఈ చేపను సోవా లేక కిరి అని స్థానికంగా పిలుస్తారు. 48 కిలోల బరువున్న ఈ చేప.. పాకిస్తాన్ కరెన్సీలో ఏకంగా 8 లక్షల 64 వేల రూపాయలు పలికింది.


ఎందుకు దీనికింత ధర? అంటే చేపలోని ఓ భాగాన్ని ఫార్మా రంగంలో ఉపయోగిస్తారట. శస్త్రచికిత్సలో వినియోగించే పరికరాల తయారీకి వినియోగిస్తారు. అందుకే ఈ క్రోకర్ ఫిష్ కు అంత డిమాండ్. ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్‌లో దీనికి అత్యధిక ధర పలుకుతుంది. ఈ మధ్య జివానిలో ఇలాంటిదే ఓ చేప చిక్కగా.. అది కూడా 7 లక్షల 80 వేలు పలికింది. పాకిస్థాన్ గ్వాదర్ పోర్టు, ఇరాన్ మధ్య ఉన్న సముద్ర జలాల్లో ఈ తరహా చేపలు లభ్యమవుతాయి. ఒక్క చేపతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు ఆ మత్స్యకారుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com