తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు నంద్యాల నియోజకవర్గానికి 18 మంది క్లస్టర్ ఇంచార్జ్ లను నియమిస్తూ పార్టీ కేంద్రకార్యాలయం నుండి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబందించిన ఉత్తర్వులు నంద్యాల తెలుగుదేశం కార్యాలయానికి అందాయి. వీరు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి స్థానిక నాయకులను సమన్వయం పరిచి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్ధి భూమా బ్రంహ్మానందరెడ్డి గెలుపుకు కృషి చేస్తారు.క్లస్టర్ ఇంచార్జ్ లుగా నియమితులైన వారిలో శాసనసభ్యులు,పార్టీ ముఖ్యనాయకులు తదితరులున్నారు