ప్రముఖ టెలికామ్ కంపెనీ ఎయిర్ టెల్ మరొకసారి తన సరికొత్త రూ.799 ప్లాన్ ఎంట్రీతో జియో కి ధీటుగా నిలవబోతున్నది. ఎయిర్ టెల్ యొక్క ఈ డేటా ప్యాక్ కేవలం ప్రీ పైడ్ వినియోగదారుల కోసం ఇవ్వబడుతుంది . ఎయిర్ టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ లో వినియోగదారులకు ప్రతీ రోజూ 3GB 2G/3G/4G డేటా ఇవ్వబడుతుంది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. అంతేకాకుండా ఏ నెట్వర్క్ కి అయినా అన్ లిమిటెడ్ లోకల్, మరియు ఎస్టీడి కాల్స్ చేసుకొనే సౌకర్యం లభిస్తుంది .