జపాన్ను భారీ భూ ప్రకంపం వణికించింది. హోన్షు తూర్పు తీరంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు సంభవించడంతో దేశం మొత్తం ఆందోళనకు గురైంది. రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ విభాగం వెల్లడించింది. ఈ ప్రకంపనలు శుక్రవారం ఉదయం 5:28 గంటలకు సంభవించినట్లుగా పేర్కొంది. ప్రసిద్ధ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా ఈ భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని అక్కడి అధికారిక వర్గాలు వెల్లడిచాయి. అయితే ప్రకంపనల ప్రభావంపై నివేదికలు అందలేదని చెప్పింది.