దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళ్లులు అర్పించారు. తమిళనాడులోని కలాం స్వస్థలమైన రామేశ్వరంలో ఏర్పాటు చేసిన కలాం స్మారక మందిరాన్ని మోడీ ప్రారంభించారు. కలాం సమాధి వద్దే ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. దివంగత అబ్దుల్ కలాం జీవితానికి సంబంధించిన కీలక ఘట్టాలను ఈ స్మారక మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలాం జీవిత విశేషాలను తెలిపే విధంగా ఫోటోలతో గ్యాలరీని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కలాం కుటుంబ సభ్యులతో కాసేపు ప్రధాని మోడీ ముచ్చటించారు. కలాం పేరుతో ఏర్పాటు చేసిన బస్ ను కూడా మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, తమిళనాడు సీఎం పళనిస్వామి, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.