పశ్చిమ బెంగాల్లో ఆఖరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 06.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినట్లయింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి. అన్ని ఛానెల్స్, ఏజెన్సీలు తమ సర్వేలను వెల్లడిస్తాయి. ఐతే పశ్చిమ బెంగాల్లో సాయంత్రం 06.30 వరకు పోలింగ్ కొనసాగుతుంది. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించింది. రాత్రి 07.30 తర్వాతే ఫలితాలను ప్రకటించుకోవచ్చని తెలిపింది. ఆలోపు ఎవరు ఫలితాలు ప్రకటించినా.. మీడియాలో వార్తలు వచ్చినా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాత్రి 07.30 తర్వాత తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.