ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 27, 2021, 05:34 PM

మంచినీళ్లు తాగినంత సులంభంగా మర్డర్లు జరుగుతున్న కాలం ఇది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రెండేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్న ఓ మహిళని నమ్మించి గొంతుకోసి హత్య చేశాడు. ఇంతకీ ఆమెను చంపాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది?.. ప్రముఖ వెబ్ సైట్ కథనం ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


చిత్తూరు జిల్లా దాసరయ్యగారిపల్లెకు చెందిన నాగవేణి(35) భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఉటుకూరుకు చెందిన రెడ్డి ప్రసాద్‌తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంత కాలం పాటు వీరిద్దరూ కాలం వెల్లబుచ్చారు. అయితే ఇటీవల ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.


దీంతో రెడ్డి ప్రసాద్ ను నాగవేణి దూరం పెట్టింది. అయితే వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే తనను దూరం చేస్తోందని భావించిన రెడ్డి ప్రసాద్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 21న రాజనాలబండలో హరికథలు జరుగుతుంటే అక్కడికి వెళ్లి నాగమణి తన టెంకాయల వ్యాపారం చేసుకుంటోంది.


ఇంతలో రాత్రి 8:30 గంటలకు రెడ్డి ప్రసాద్ నుంచి నాగవేణికి ఫోన్ వచ్చింది. దగ్గర్లో ఉన్న నరసింహస్వామి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం వద్దకు రావాలని కోరాడు. మాట్లాడి వెళుదువులే అని సముదాయించాడు. అతడి మాటలు నమ్మిన నాగవేణి అక్కడికి వెళ్లింది. అప్పటికే ప్లాన్ ప్రకారం తనతో పాటు తన బంధువు ప్రకాష్ ను కూడా వెంటపెట్టుకు వచ్చాడు రెడ్డి ప్రసాద్. అక్కడికి చేరుకున్న నాగవేణిని కత్తితో గొంతు కోశారు. తలపై బండరాయి వేసి హత్య చేశారు.


ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి పరార్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, బంగారు గొలుసు, కమ్మలు, గాజులు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నమ్మివచ్చిన పాపానికి నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకుని నాగవేణి జీవితాన్ని అర్థాంతరంగా ముగిసేలా చేశారు. హత్య చేసి తామూ జైలు పాలయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com