భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. భారత్ లో ఒకటి కాదు రెండు కాదు మూడు వేరియంట్లతో కరోనా విరుచుకుపడుతుంది. కరోనా వైరస్ మూడు వేరియంట్లతో ఎప్పటికప్పుడు తన రూపు మార్చుకుంటుంది. యూకే,బ్రెజిల్,దక్షిణాఫ్రికా వేరియంట్లు భారత్ లో అతి వేగంగా వ్యాపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్,మహారాష్ట్రలో దీని ప్రభావం ఎక్కువ ఉంది. కరోనా గాలి ద్వారా వ్యాపించే స్థాయికి చేరిందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ పరిశీలనలో వెల్లడైంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో అత్యంత వేగంగా వ్యాపిస్తుందని, అలర్ట్ గా ఉండకుంటే మరణాలు తప్పవని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి కరోనాను రాకుండా చూసుకోవాలని, లేకుంటే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.