న్యూఢిల్లీ: నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ ఇవాళ రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాజ్ఘాట్లో మహాత్ముడికి నివాళి అర్పించిన తర్వాత ఆయన తన సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి రాష్ట్రపతిభవన్లో ఉన్న కొన్ని రూమ్లను కలియతిరిగారు. రాష్ట్రపతిభవన్లో గత అయిదేళ్ల తాను తీసుకువచ్చిన మార్పులను ప్రణబ్ నూతన రాష్ట్రపతికి వివరించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యేక వాహనంలో పార్లమెంట్కు చేరుకున్నారు. ప్రణబ్, కోవింద్ రాక సందర్భంగా రైసినా హిల్ నుంచి పార్లమెంట్ వరకు రోడ్లను బ్లాక్ చేశారు. మెర్సిడీజ్ కార్లలో ఇద్దరూ పార్లమెంట్కు భవనం వరకు వెళ్లారు. రాజ్పథ్ మార్గం ద్వారా ఇద్దరూ ప్రయాణించారు.