తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్న 71,573 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 32,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత స్వామి దర్శనానికి అనుమతిస్తారు. కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు.