ముంబయి: ఇటీవల ఐఫా వేడుకలు న్యూయార్క్లోని మెట్లైఫ్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఆగస్టు 10 నుంచి ఐఎఫ్ఎఫ్ఎం(ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్) వేడుకలు ఆస్ట్రేలియాలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ వేడుకలకు ఐశ్వర్యరాయ్ అతిథిగా హాజరుకాబోతోంది.
అంతేకాకుండా ఆగస్టు 15న భారత స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని 12న మెల్బోర్న్లోని ప్రముఖ ఫెడరేషన్ స్క్వేర్ బిల్డింగ్ వద్ద ఐష్ జాతీయ జెండాను ఎగరవేయనుంది. మెల్బోర్న్లో జెండా ఎగురవేయనున్న తొలి భారతీయ నటి కూడా ఐశ్వర్యే కావడం విశేషం. ఈ సందర్భంగా మెల్బోర్న్ ఫెస్టివల్ డైరెక్టర్ మిటు భౌమిక్ మీడియాతో మాట్లాడుతూ.. ఐశ్వర్య లాంటి అందమైన, ప్రతిభ కలిగిన నటిని ఫెస్టివల్కి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం తమకు గర్వంగా ఉందని పేర్కొన్నారు.
12 రోజుల పాటు ఈ ఫిలిం ఫెస్టివల్ జరగబోతోంది. తొలి రోజున అలంకృత శ్రీవాస్తవ తెరకెక్కించిన ‘లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ ఫెస్టివల్కి కరణ్ జోహార్, రవీనా టాండన్, సిమి గరెవాల్, మలైకా అరోరా ఖాన్ తదితరులు హాజరుకానున్నారు.