ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని సుప్రీం కోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. కోవిడ్ మహ్మమారిని దృష్టిలో పెట్టుకుని మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తాజాగా విచారణ జరిపింది. మారటోరియం కాలాన్ని పొడిగించడం, మొత్తం వడ్డీని మాఫీ చేయమని ఆదేశించడం సాధ్యం కాదని తీర్పునిచ్చింది. అలాగే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తాజాగా స్పష్టం చేసింది.
మారటోరియం కాలానికి రుణాలపై ఎలాంటి చక్రవడ్డీ విధించొద్దని ఆదేశించింది. అయితే ఆగస్టు 31 వరకు ఉన్న మారటోరియం కాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.2 కోట్లవరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. కరోనా మహమ్మారి కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా నష్టపోయిందని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయని గుర్తు చేసింది.