ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ పేరు వింటే అమెరికా సైతం వణికిపోతుంది. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాలు గురించి తెలిస్తే.. మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. కిమ్ పెట్టిన నిబంధనలతో ఆ దేశంలో అధికారులు, ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశం ఇప్పటికీ సుమారు వందేళ్లు వెనకబడే ఉందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
ఆ దేశంలో ఇంటర్నెట్ ఉండదు. కేవలం 3 టీవీ చానెళ్లు మాత్రమే ఉంటాయి. ఫోన్లు ఉపయోగించకూడదు. అక్కడి పేదలను ఫొటోలు తీయకూడదు. ప్రపంచమంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే.. ఆ దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే, ఇన్నాళ్లు ఆ దేశాన్ని పీడించిన కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే సమాచారం తెలియగానే.. అతడి పీడ ఇకనైనా వదులుతుందని ఎదురు చూశారు. కానీ, నేను క్షేమంగానే ఉన్నానంటూ అతడు మళ్లీ కనిపించడం ప్రజలను నిరాశ పరిచింది. అయితే, అక్కడి ప్రజలు కిమ్ చనిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఈ కఠోర వాస్తవాల తెలిస్తే.. అక్కడి ప్రజలు కోరిక న్యాయమైనదే అనిపిస్తుంది.
దేవుడని చెప్పుకొనే రాక్షసుడు
ఉత్తర కొరియాలోని ప్రజలను చూస్తే.. తప్పకుండా జాలి కలుగుతుంది. అక్కడి నిబంధనలు గురించి తెలిస్తే.. అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ను అక్కడి ప్రజలు దేవుడు అనుకుంటారు. కాదు.. కాదు.. అలా ఒప్పుకుని తీరాలి. లేకపోతే వాళ్లు ప్రాణాలతో ఉండరు.
వారానికి 7 రోజులూ పనే
ఆ రోజులు వరుసగా పని చేయాలంటేనే మనకు విసుగు వస్తుంది. కానీ, ఆ దేశంలో వారంలో 7 రోజులు పనే. బయటకు మాత్రం వారంలో 6 రోజులు మాత్రమే పని అని చెబుతారు. కానీ, సెలవు రోజు మాత్రం ఖాళీగా ఉండనివ్వరు. ఆ రోజు కూడా ప్రజలు వాలంటీర్ గా పనిచేయాలి. అంటే.. అక్కడ 7 రోజులూ పని చేయాల్సిందే.
కారణ జన్ముడు కిమ్!
కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ల కిందట తన బయోగ్రఫీని విడుదల చేశాడు. అందులో.. తాను రెండు ఇంధ్ర దనస్సుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంతేకాదు.. అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉదంట. దైవం పుట్టించిన కారణ జన్ముడనని కిమ్ భావిస్తుంటాడు.
అక్కడి సంవత్సరం వేరు.. మన సంవత్సరం వేరు
ఉత్తర కొరియాలో ఈ ఏడాది 2020 కాదు. అక్కడ ప్రస్తుతం 107వ సంవత్సరం నడుస్తోంది. ఆ దేశంలో మనం ఫాలో అయ్యే క్యాలెండర్ను వారు అస్సలు ఫాలో కారు. ‘కిమ్-2 సంగ్’ పుట్టిన రోజు నుంచే అక్కడి క్యాలెండర్ ను లెక్కిస్తారు. ఆ రోజే వారికి న్యూ ఇయర్ కూడా. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్ కూడా ఉంది. జపానీయుల కంటే 30 నిమిషాలు ముందుకు సమయాన్ని మార్చుకున్నారు.
పోర్న్ సినిమాలు చూస్తే మరణమే
దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు. కానీ, ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆ దేశంలో ఎవరైనా పోర్న్ చూస్తున్నారనే అనుమానం కలిగినా చాలు చంపేస్తారు. అక్కడ ఎవరూ బైబిల్ చదవ కూడదు. ఎవరి వద్దనైనా బైబిల్ కనిపిస్తే చంపేస్తారు. ఆ దేశంలోని ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది. అదెప్పుడూ ఆన్ లోనే ఉండాలి. ఆపితే.. శిక్ష తప్పదు.
పేదలను ఫొటోలు తీయకూడదు
ఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పర్యాటకులు అక్కడి పేదలకు ఫొటోలు తీయకూడదు. అందుకే ఆ దేశానికి వెళ్లే పర్యటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. ఫోన్లతో ఆ దేశంలో తిరగకూడదు. పర్యటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ తిరగకూడదు.
ఆ రోజుల్లో ఉత్సవాలు నిషేదం
ఉత్తర కొరియాలో జులై 8, డిసెంబరు 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. కనీసం పుట్టిన రోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే.. కిమ్ తాత కిమ్ 2 సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ 2 లు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ పూర్వికులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రను బోధిస్తారు.
మూడే టీవీ చానెళ్లు.. ఇంటర్నెట్ ఉండదు
మన దేశంలో దూరదర్శన్కు ఉన్నన్ని చానెళ్లు కూడా ఆ దేశంలో ఉండవు. అక్కడ కేవలం మూడు టీవీ చానెళ్లకు మాత్రమే అనుమతి ఉంది. వాటిలో కూడా కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రసారమవుతాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలీదు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం వీఐపీలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. ఇందుకు రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
నేరం చేస్తే.. 3 తరాలకు జైలు శిక్ష
ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చేయాలంటేనే భయపడిపోతారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే.. అతడి తర్వాతి 2 తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే.. 3 తరాలు తమ జీవితమంతా జైల్లోనే గడపాలన్నమాట. ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది బంధీలుగా ఉన్నారు. వారు తప్పించుకోకుండా జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు.
ఏకంగా నకిలీ నగరాన్నే నిర్మించేశాడు
శత్రు దేశమైన దక్షిణ కొరియన్లను ఎర వేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవరూ నివసించరు. రాత్రివేళ్లల్లో మాత్రం ఇళ్లలో లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు. అయితే, దక్షిణ కొరియా తెలివి తక్కువది కాదు. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించి అప్రమత్తంగా ఉంటోంది. కిమ్ మరణం తర్వాత దురాక్రమణకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
శారీరక అవసరాల కోసం.. మహిళలతో ‘ప్లెజర్ స్క్వాడ్’
కిమ్ జాన్ ఉన్ 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ‘ప్లెజర్ స్క్వాడ్’ను ఏర్పాటు చేశాడు. వాళ్లు కిమ్ తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి. వీరిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికం. వీరిలో కిమ్ వద్ద పనిచేసే మహిళలు వేరేగా ఉంటారు. కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి. మిగతా బాలికలు సైతం కిమ్ కు సేవలు అందించే సైన్యానికి శృంగార కోరికలు తీర్చాలి.
ఎన్నికలు ఉంటాయ్, కానీ..
ఉత్తర కొరియాలో కూడా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు. ప్రజలకు అతడు నచ్చనట్లయితే.. తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ ధైర్యం చేయలేక ప్రజలు కిమ్నే తమ అధినేతగా అంగీకరిస్తున్నారు.
కిమ్ ఆగడాలను తెలిపే.. మరికొన్ని మచ్చుతునకలు
- కిమ్ జాన్ ఉన్ తన మావయ్యను దుస్తులు విప్పి, ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోనులో వేసి చంపేశాడు.
- ఈ దేశంలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు. ఇక్కడి ఇళ్లు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ పూర్వికులు, నాయకుల ఫొటోలు ఉండాలి.
- మగవాళ్లంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్ నే అనుకరించాలి.