భారతదేశానికి చైనా అతి పెద్ద శత్రువు అన్నారు సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్. భారత్ పై యుద్ధం చేసేందుకు పాకిస్థాన్ తో కలిసి చైనా అన్ని ఏర్పాట్లు చేసుకుందని చెప్పారు. భూటాన్, సిక్కింలను ఆక్రమించాలని చైనా ప్రయత్నిస్తోందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. చైనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోక్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ములాయం…. పాకిస్థాన్ మనల్ని ఏమీ చేయలేదని, కానీ చైనా ద్వారా భారత్ ను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తోందన్నారు.