ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 నుంచి ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నాలుగో దశ పరీక్షలు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 05, 2021, 01:54 PM

న్యూఢిల్లీ: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష నాలుగో దశ షెడ్యూల్‌ను రైల్వేరిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. నాలుగో దశ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు మార్చి 3న ముగుస్తాయని తెలిపింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలకు నాలుగు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. 


ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షలు దశలవారీగా జరుగుతున్నాయి. మొదటి రెండు దశలు ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. జనవరి 31న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈనెల 12న ముగియనున్నాయి. ఈ పరీక్షలకు సుమారు 28 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.  


35,208 నాన్‌టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టులతో 2019లో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సీనియర్‌ టైమ్‌ కీపర్‌, కమర్షియల్‌ అప్రెంటిస్‌, స్టేషన్‌ మాస్టర్‌, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, గూడ్స్‌ గార్డ్‌, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూనియర్‌ టైమ్‌ కీపర్‌, ట్రెయిన్స్‌ క్లర్క్‌, కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com