గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని సీతా రామిరెడ్డి పాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇరుపక్షాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని తెనాలి వైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.