శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర పోలీసులు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విదర్భా ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగిన ఉదంతంలో విచారణ చేస్తున్న ఏసీబీ, కేసులో బొల్లినేని పాత్ర ఉన్నట్టు నిర్థారించుకున్న నేపథ్యంలో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం వెనుక ఆయన పాత్ర ఉన్నట్టు ఏసీబీ అధికారులు సాక్ష్యాలను సంపాదించినట్టు సమాచారం. ఈ భారీ కుంభకోణంలో బొల్లినేని పాత్రపై విచారిస్తున్న మహారాష్ట్ర పోలీసులు, నెల్లూరు, కావలిలోని ఆయన ఆస్తులపైనా విచారణ ప్రారంభించారు. ఇటీవల ఆయన ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.