అమరావతి: రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. యూనివర్సిటీని కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. కాగా... ఏడు ఎకరాల్లో 3లక్షల చదరపు అడుగుల్లో యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం జరగనుంది. ఆగస్టు 7 నుంచి క్లాసులు ప్రారంభంకానుండగా 200మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమవుతున్నాయి. అలాగే యూనివర్సిటీకి ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తారు. రికార్డు సమయంలో పూర్తిచేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.