ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 13, 2021, 02:28 PM

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో ఆరవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు తూర్పు ఇంచార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఆరవ డివిజన్ లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా స్థానిక క్యాడర్ పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి డివిజన్ పార్టీని పటిష్టం చేయాలని అందరు ఐక్యమత్యంగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.
డివిజన్ అధ్యక్షుడిని అందరు కలిసి ఒక తాటి మీద నిలబడి ఒక అభిప్రాయం తీసుకొని ఎన్నుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు. పోతురాజు చంద్రశేఖర్ బాజీ మాస్టర్. షేక్ ఫిరోజ్, తాటి వాక సుబ్బారావు,పద్మావతి డివిజన్ లో ఉన్నటువంటి స్థానిక పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com