అమరావతి : ఈ ఏడాది విజయదశమికి అమరావతి పాలన నగర నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం సింబల్ ఆఫ్ ప్రైడ్గా, పోలవరం నిర్మాణం సింబల్ ప్రోగ్రెస్గా అభివర్ణించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు సౌభాగ్యం, సంతోషాలకు సూచికలని, ఆగస్టు 15 లోగా సవివర ఆకృతులు అందించాలని ఫోస్టర్స్ బృందానికి సీఎం సూచించారు. తుది ఆకృతులపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులకు ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.