ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ను వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు కలిశారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను కేవలం కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి పరిష్కారం విషయమై చర్చించేందుకు లోకేశ్ ను కలిశానని, అంతేతప్పా, ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు.