అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఈనెల 20వ తేదీ నుంచి శబరిమలకు రోజుకు ఐదు వేల చొప్పున భక్తులను అనుమతి ఇవ్వనున్నారు. అయితే శబరిమలకు వచ్చే భక్తులు మాత్రం కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తీసుకుని వస్తేనే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పని సరి అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 2 వేల మంది, శని, ఆదివారాల్లో 3 వేల చొప్పున భక్తులను అనుమతి ఇస్తున్నారు.