ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 09, 2020, 02:03 PM

దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగడంతో చాలా మంది పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్‌గా బంగారాన్ని ఎంచుకున్నారు. దాంతో నిన్న బంగారం ధరలు రివ్వున దూసుకెళ్లాయి. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు అత్యంత భారీగా పెరిగాయి. బంగారం ధరలు చూసినట్లైతే నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,600 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.700 పెరిగింది. తులం బంగారం కావాలంటే దాని ధర రూ.37,280 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.560 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,660 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,830 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.760 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,664 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.608 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,083 ఉంది.
వెండి ధరలు వరుసగా రెండు రోజులు తగ్గి మళ్లీ భారీగా పెరిగాయి. 2 రోజుల్లో రూ.4,500 దాకా తగ్గినా నిన్న ఏకంగా 6,500 పెరిగింది. ఈమధ్య కాలంలో ఇంతలా వెండి ఎప్పుడూ పెరగలేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,500 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.6,500 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.556 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.52 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.69.50 ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com