కర్నూలు జిల్లాలో తండ్రీకూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బనగానపల్లె పట్టణ సమీపంలోని బాపూజీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న తండ్రి వెంకటేశ్వర్లు,కూతురు జ్యోతిలు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.