ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని పేదలకు శుభవార్త..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 30, 2020, 12:09 PM

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. డిసెంబర్ 25 తేదీ నుంచి తొలి దశ కింద 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాలలో 11,22,559 ఇళ్లు నిర్మితం అవ్వనున్నాయి. మిగతా 3,87,668 ఇళ్లు.. వ్యక్తిగత స్థలాలున్న వారికి ప్రభుత్వం మంజూరు చేయనుంది. జగనన్న కాలనీల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ముడి సరకును గవర్నమెంటే అందజేస్తుంది. ఇసుకను ఫ్రీగా సరఫరా చేయనున్నారు. సిమెంటును రూ.220 నుంచి రూ.240లోపు ధరలతో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర సామగ్రిని ప్రభుత్వం రివర్స్‌ టెండర్ల ప్రక్రియలో కొనుగోలు చేయనుంది. కిటికీలు, తలుపులు, ఇనుము, పెయింట్స్‌, ఎలక్ట్రికల్‌ వస్తువులు, శానిటరీ సామగ్రి తదితరాలకు అధికారులు రాష్ట్ర స్థాయిలో టెండర్లను నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com