తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ని పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బయటకు వస్తున్న క్రమంలో వాహనం ఆపి పోలీసులు తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే తనిఖీలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.