పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంతో పాటు ప్రాజెక్టు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్న ఆందోళన ప్రజల్లో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పోలవరం పరిరక్షణ యాత్రకు సంబంధించి ఈనెల 19న జలవనరుల శాఖ మంత్రికి లేఖ ఇచ్చామని...యాత్రకు జలవనరుల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు అర్థరాత్రి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నేతలును హౌస్ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తుందా? లేక ప్రజాస్వామ్యం ఉందా అర్ధం కావడం లేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు.