ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర ప్రమాదం..ఐదుగురు సజీవదహనం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 17, 2020, 02:49 PM

ట్రక్కును కారు ఢీకొట్టిన సంఘటనలో మంటలు వ్యాపించి ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్‌-సునమ్‌ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలను సంగ్రూర్‌ ఎస్పీ వివేక్‌ షీల్‌ సోని వెల్లడించారు. సంగ్రూర్‌ జిల్లాలోని దిర్బా పట్టణంలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఐదుగురు సోమవారం అర్ధరాత్రి మోగాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో సంగ్రూర్‌-సునమ్‌పై కారు ఓ ట్రక్కు డీజిల్‌ ట్యాంకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న వారు బయటకు రాలేకపోవడంతో సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు వైద్యుడు ఉన్నారని సంగ్రూర్ ఎస్పీ వివేక్ షీల్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com