బీహార్ వాసులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తామని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పూర్తిగా చట్టబద్ధమైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పాట్నాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రగతిశీలంగా ఆలోచిస్తూ, రాష్ట్రానికి తన మేనిఫెస్టోలో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తే ఏ ప్రతిపక్ష పార్టీకి ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు. ‘కొందరు దీన్ని రాజకీయ కుట్ర’గా పేర్కొనడం ఆశ్చర్యకరమైన విషయమని, ప్రజల ఆరోగ్య సంరక్షణకు వాగ్ధానాలు చేయరా? అని ప్రశ్నించారు.
ఉచిత వ్యాక్సిన్ ప్రకటన పూర్తిగా చట్టబద్ధమైనది, ఎన్నికలకు ముందు వాదనలు చేసే వ్యక్తులకు మాత్రమే ఇది సమస్యాత్మకమన్నారు. బిహార్ నివాసులకు ఉచిత వ్యాక్సిన్ వాగ్ధానం ప్రజల ఆరోగ్యం పట్ల తమ పార్టీని నిబద్ధతను చూపుతుందంటూ మేనిఫెస్టో కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. బిహార్లో మూడు దశల్లో జరిగే ఎన్నికల కోసం బీజేపీ గురువారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఐసీఎంఆర్ నుంచి వ్యాక్సిన్కు అనుమతి పొందిన తర్వాత ప్రజలకు ఉచితంగా టీకాను వేస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోలో కొవిడ్ వ్యాక్సిన్ను చేర్చడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబుద్దుల్లా విమర్శించారు.