హీరో ప్రభాస్ బర్త్ డే వేడుకల్లో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనూరు గ్రామంలో ప్రభాస్ ఫ్లెక్సీలు కడుతుండగా సుగుణరావు అనే వ్యక్తి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పూనూరు గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. గతంలో కూడా పవన్ కళ్యాన్ బర్త్ డేకు ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు అభిమానులు మరణించిన విషయం తెలిసిందే.
ఇక మరో వైపు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం L N పురంలో కూడా విషాదం చోటు చేసుకుంది. అక్కడ నలుగురు యువకులు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతున్న నేపధ్యంలో ఆ ఫ్లెక్సీ విద్యుత్ వైర్లకు తాకడంతో గండికోట దుర్గాప్రసాద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.