ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునరుద్ధరణ ముంగిట ఉన్నాం : ఆర్బీఐ గవర్నర్

national |  Suryaa Desk  | Published : Thu, Oct 22, 2020, 02:01 PM

కరోనా మహ మ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పున రుద్ధరణ ప్రక్రియలో అడుగు దూరంలో ఉన్నా మని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థకు దోహ దపడేలా మూల ధనం కలిగివున్నామనే భరో సాను బ్యాంకు లు ఖచ్చితంగా కల్పించాలని ఆయన సూచించారు. కోవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకునే ప్రక్రియలో ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. వీలైనంత త్వరగా సంక్షోభం సమసిపోతుం దని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు చెబుతున్నాను. మూలధనాన్ని పెంచుకోవాలని బ్యాంకులను నేను కోరాను. ఈ మేరకు బ్యాంకు లపై నమ్మకం ఉంది. బ్యాంకులు తమపై తాము ఆధారపడడమే కాకుండా తగిన మూలధనాన్ని నిర్వహిస్తూ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇవ్వాలి. పునరుద్ధరణ చివరి దశలో ఉన్నామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ రచించిన ‘పోర్ట్రాయిట్స్‌ ఆఫ్‌ పవర్‌’ పేరిట రచించిన పుస్తకావిష్కరణ సందర్భంగా జరిగిన ప్యానెల్‌ చర్చలో ఆయన మాట్లాడారు. కోవిడ్‌ ప్రభావంపై మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com