ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో‌ కొత్తగా 55,838 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 22, 2020, 11:21 AM

భారత్‌లో తగ్గిన కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,838 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,06,946కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ సోకి 702 మంది బాధితులు మరణించారు. ఇక డిశ్చార్జిల విషయానికి వస్తే.. నిన్న ఒక్కరేజే 79,415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 68,74,518మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,16,616 మంది బాధితులు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,15,812 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.63 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.85 శాతంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com