జనసేన అధినేత పవన్కళ్యాణ్ బహిరంగంగా అమరావతికి మద్దతు తెలిపారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. రాజధాని తరలింపు జగన్ తరం కాదని.. అమరావతి అభివృద్ధి నిలుపుదల చేయడంతో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందన్నారు. అమరావతికి మద్దతుగా 12న విజయవాడ, గుంటూరులో సామూహిక దీక్ష చేస్తామన్నారు.