ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మామ, జగన్ భార్య వైఎస్ భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత కన్నుమూశారు. గంగిరెడ్డి భౌతిక కాయాన్ని పులివెందులకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.