ఐపీఎల్ 2020 సీజన్ 13లో బుధవారం ముంబై ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్ల మధ్య టాస్ పడింది. ముంబై ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో కార్తీక్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిపోయిన ముంబై జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఆరాటపడుతోంది. మరోపక్క కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్ లో విజయం సాధించాలని చూస్తోంది. కరోనా కారణంగా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫ్యాన్స్ లేకుండా ఖాళీ స్టేడియాలలో మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.