ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత ప్రభుత్వంలో జరిగిన కారుణ్య నియామకాలు బోగస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 07:18 PM

గత ప్రభుత్వంలో ఎస్వీ యూనివర్సిటీలో కారుణ్య నియామకాల విషయంలో తీవ్ర స్థాయిలో తప్పుదోవ పట్టించారని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లెక్కల రాజశేఖరరెడ్డి ఆరోపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో కలిపి జరిగిన కారుణ్య నియామకాల కన్నా ఒక ఎస్వీ యూనివర్సిటీలో మాత్రమే ఎక్కువగా జరగడానికి గల కారణం ఎవ్వరికీ అంతుపట్టడం లేదని, కిడ్నీ సమస్య అనే విషయాన్ని చాలామందికి ఉపయోగించడంలో ఉన్న ఆంతర్యాన్ని బయట పెట్టాలని, ఈ విషయంలో కొంతమంది పెద్దల హస్తం ఉందని వారు చేసిన అన్యాయాలపైన గతంలో ప్రొఫెసర్ వల్లీ కుమారి కమిటీ కూడా అవకతవకలు జరిగాయని నిర్ధారించడం జరిగింది.కానీ నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వలన కమిటీ రిపోర్టును బహిర్గత పరచలేదని ఇప్పుడు ఉన్న అధికారులు అయినా స్పందించి కమిటీ రిపోర్టును బహిరంగపర్చాలని,పైన జరిగిన అవినీతిపై కచ్చితంగా సిబి సి ఐ డి విచారణ జరగాలని అదే విధంగా కొంత మంది నాన్ టీచింగ్ ఉద్యోగుల టెక్నికల్ సర్టిఫికెట్ల విషయంలో బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందారని దీనికి సంబంధించిన విషయంలో నిజానిజాలు బయట పెట్టాలని, వారి సర్టిఫికెట్లు బహిరంగంగా అందరి ముందు ఉంచాలని, కనుక యూనివర్సిటీ అధికారులు కచ్చితంగా పైన జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరగాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.యూనివర్సిటీ అధికారులు జాప్యం చేసినట్లయితే పైన జరిగిన విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులైన సాయి, ప్రేమ్, హరి, అభి,శ్రీకాంత్ మొదలుకు విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com