దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్ శాఖ సరికొత్త యాప్ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను ఇంటి వద్ద నుంచే పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్ సేవ’యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసు స్టేషన్ ద్వారా లభించే అన్నిరకాల సేవలను ఈ మొబైల్ యాప్ ద్వారా పొందేలా రూపొందించింది. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయొచ్చు..అంతే కాకుండా ఫిర్యాదులకు సంబంధించి రశీదు కూడా పొందే విధంగా యాప్ ను రూపొందించారు. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని భావిస్తున్న ఈ ‘ఏపీ పోలీస్ సేవ’యాప్ ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంచెంసేపటిక్రితం లాంచ్ చేశారు. మెుత్తం ఈ యాప్ లో ఆరు విభాగాలకు సంబంధించి 87 రకాల సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఏపీ పోలీస్ సేవ యాప్ నుంచే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేస్తే పోలీస్ కంట్రోల్ రూంకు వెంటనే సమాచారం వెళ్తుందని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా కల్పిస్తోంది.
ఈ యాప్లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్ తో ' మహిళల కు రక్షణగా , తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది. ఇకపోతే రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్, స్వల్ప వ్యవధి లోనే పదకొండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
ఈ యాప్ ద్వారా 568 మంది నుండి ఫిర్యాదులు స్వీకరించగా 117 యఫ్.ఐ.ఆర్ లను నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది.ఇప్పటివరకు 1,850 పిటిషన్ లు అందగా 309 యఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు పోలీస్ శాఖ స్పష్టం చేసింది.